
కూనవరం, డిసెంబర్ 14 (ఆంధ్ర సమాచార్) ప్రతినిధి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సోయం చిన్నబాబు పిలుపునిచ్చారు అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం రేఖపల్లి గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోయం చిన్న బాబు డిసెంబర్ 21 సిపిఎం ఆధ్వర్యంలో చింతూరులో జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ…ఈ ప్రాంతంలో అనేకమంది అమరవీరులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేరని వారిని స్మరించుకుంటూ జరిగే సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు…ఈ సమావేశంలో పంకు సత్తిబాబు, కారం సుందరయ్య,పొడియం. శ్రీరాముర్తి,తాతబాబు, లక్ష్మణరావు,సూరిబాబు,పాండు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు…

